పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. 823 అసెంబ్లీ స్థానాలకు గాను 223 కౌంటింగ్ సెంటర్లలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే ఈ లెక్కింపు ప్రక్రియ అధికారికంగా మొదలవ్వడానికి ముందు, కౌంటింగ్ సిబ్బంది సాంకేతిక, భద్రతాపరమైన విధులను పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న సిబ్బందికి ముందుగా రాండమైజేషన్ ద్వారా ఏ టేబుల్ వద్ద విధులు నిర్వహించాలో కేటాయించారు. ఏ అధికారికి ఏ నియోజకవర్గం లేదా ఏ టేబుల్ వస్తుందో చివరి నిమిషం వరకు తెలియకుండా ఉండటం కోసం ఈ ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో నిర్వహించారు.










